అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hemophilia Awareness | హీమోఫీలియా బాధితులు క్రమం తప్పకుండా వైద్యసేవలు పొందాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ అన్నారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ/ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

Hemophilia Awareness | హీమోఫీలియాపై సమాజంలో అవగాహన పెంపొందించాలి..
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ (Medical College Principal) కృష్ణమోహన్ మాట్లాడుతూ.. హీమోఫీలియాపై సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. హీమోఫీలియా వ్యాధి (Hemophilia) గురించి అవగాహన కల్పిస్తూ, ముందస్తు గుర్తింపు, సరైన నిర్ధారణ తగిన చికిత్స ద్వారా సమస్యలను నివారించవచ్చని ఆయన తెలియజేశారు. హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్య సేవలు పొందడం ఎంతో ముఖ్యమని, సమాజంలో అవగాహన పెంపొందించడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.
ర్యాలీ సందర్భంగా వైద్యులు ప్రజలకు హీమోఫీలియాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ తిరుపతి రావు, డాక్టర్ కిషోర్ కుమార్, హీమోఫీలియా నోడల్ ఆఫీసర్ (Hemophilia Nodal Officer) పవన్ పాల్గొన్నారు. అలాగే మెడికల్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అవగాహన ర్యాలీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (Government General Hospital) వరకు సాగింది.
ఇది కూడా చదవండి..: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా మహమ్మద్ ఘాజి
