అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heat Wave | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో నాలుగు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే ఎండ తీవ్రత మొదలు అవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం పూట వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana Heat Wave | అప్రమత్తంగా ఉండాలి
రాబోయే 4 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 19 వరకు ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలో 42-44°C హైదరాబాద్లో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దు. అత్యవసరం అయితే తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి.
Telangana Heat Wave | ఉష్ణోగ్రతల వివరాలు
రాష్ట్రంలోని పలు జిల్లాలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. నల్గొండ 43.5 డిగ్రీలు, జగిత్యాల 43.4, నిర్మల్ 43.3, నిజామాబాద్ 43.3, ఆదిలాబాద్ 43.2, సిద్దిపేట 42.9, కామారెడ్డి 42.8, కరీంనగర్ 42.8, మంచిర్యాల 42.8, సిరిసిల్ల 42.8, సంగారెడ్డి 42.8, గద్వాల 42.7, ఆసిఫాబాద్ 42.7, నాగర్ కర్నూల్ 42.7, పెద్దపల్లి 42.7.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Meeting | కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.. జీవన్ రెడ్డిపై రేవంత్ ఫైర్!
