అక్షరటుడే, గాంధారి: Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు (Road Accidents) తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గాంధారి మండలంలోని హరాలి గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత, ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Road Safety Awareness | ప్రతి ఏడాదిలో 600కు పైగా కుటుంబాలు..
ఈ సందర్భంగా సంజయ్కుమార్ జైన్ (Additional DGP Sanjay Kumar Jain) మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతినెలా సుమారు 600 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. యుద్ధం కంటే రోడ్డు ప్రమాదాలు భయంకరమైనవని.. ఇష్టానుసారంగా తాగి డ్రైవింగ్ చేస్తే ఎదుటివారి ప్రాణాలు పోవడానికి సైతం కూడా కారణమవుతామని వివరించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దని సూచించారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 28 బ్లాక్ స్పాట్లను గుర్తించామని.. అక్కడ స్పీడ్ బ్రేకర్లు, రంబల్స్ స్ట్రీఫ్, డ్రమ్ములను అడ్డుగా పెట్టడం వంటివి చేసి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నామని తెలిపారు.
Road Safety Awareness | మద్యం తాగి వాహనాలు నడపవద్దు
అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని అడిషనల్ డీజీపీ తెలిపారు. కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే గతేడాది 224 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆపరేషన్ కవచ్లో అర్ధరాత్రి కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం మొబైల్ కంటి స్క్రీనింగ్ వాహనాన్ని రిబ్బన్ కట్చేసి కంటి పరీక్షలు నిర్వహణను ప్రారంభించారు. సుమారు వెయ్యి మందికి కంటి పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సర్పంచ్ రేణుక సంజీవ్ యాదవ్, తహశీల్దార్ రేణుక చావన్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..
