అక్షరటుడే, వెబ్డెస్క్ : Delimitation Seats Increase | డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయన్నారు. తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. 26కు పెరుగుతాయని వెల్లడించారు.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల (South States)కు అన్యాయం జరుగుతుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభలో షా క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు చాలా లాభం కలుగుతుందన్నారు. ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని, తమిళనాడులో 39 నుండి 59కి పెరగనున్నాయని ప్రకటించారు.
Delimitation Seats Increase | తప్పుడు ప్రచారం
దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని అమిత్ షా తెలిపారు. విపక్షాలు అబద్దాలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కర్ణాటకకు ప్రస్తుతం 28 స్థానాలు ఉన్నాయని, ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత 42 అవుతాయన్నారు. కేరళ 20 నుంచి 30కి చేరుతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో, 129 మంది ఎంపీలు దక్షిణాది నుంచి ఉన్నారన్నారు. ఇది సుమారుగా 23.76 శాతానికి సమానమని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంపీల సంఖ్య 195కు చేరుతుందని, వారి ప్రాతినిధ్య బలం 23.97 శాతానికి పెరుగుతుందన్నారు.
Delimitation Seats Increase | చట్టంలో మార్పులు చేయలేదు
డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో తాము ఎటువంటి మార్పులు చేయలేదని అమిత్ షా అన్నారు. గతంలో ఇందులో ఏదో తారుమారు జరిగిందని ప్రియాంక గాంధీ అంటున్నారని, తాము మాత్రం అలా చేయమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అత్యవసర పరిస్థితిని (Emergency) విధించినప్పటికీ ప్రజల అభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించలేమన్నారు. ప్రజలకు వాస్తవం ఏమిటో బాగా తెలుసన్నారు.
దీనిని కూడా చదవండి : Women Reservation Bill | దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం : ప్రధాని మోదీ
