అక్షరటుడే, ఎల్లారెడ్డి: Farmer Heat Stroke | వడదెబ్బకు (Heat Stroke) తన వ్యవసాయ క్షేత్రంలోనే ఓ రైతు కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డి (Yellareddy News) మండలం అడివిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది.
Farmer Heat Stroke | నీళ్లు పెట్టడానికి వెళ్లి..
ఎల్లారెడ్డి ఎస్సై మహేష్(SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. రైతు లింగాల రాములు (59) శుక్రవారం ఉదయం తన పొలంలో పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పొలానికి నీళ్లు పారించేందుకువెళ్లి, రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆయన కుమారులు పొలానికి వెళ్లి వెతికగా.. రాములు పొలం గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మహేష్(Yellreddy Police) వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు.
