అక్షరటుడే, కామారెడ్డి: Janasena Leader Joins Congress | కామారెడ్డి (Kamareddy) పట్టణానికి చెందిన జనసేన నాయకుడు, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీ నర్సాగౌడ్ శనివారం టీపీసీసీ(TPCC) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrasekhar Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగం, సెక్రెటరీలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Janasena Leader Joins Congress | కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి..
ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, అరుణ్, మెహర్ బాబా గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Janasena Leader Joins Congress | రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత
మాచారెడ్డి (Machareddy) మండలం ఘనపూర్ (ఎం) గ్రామానికి చెందిన లోయపలి లక్ష్మి కుటుంబానికి రూ.2.50 లక్షల ఎల్వోసీని(LOC) టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. లోయపల్లి లక్ష్మి గత ఆరు నెలలుగా గుండె నొప్పితో బాధపడుతున్నారు.
ఈ విషయం కాంగ్రెస్ యూత్ (Youth Congress) నాయకులు.. రాజశేఖర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఆపరేషన్ నిమిత్తం కోసం రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి : MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
