అక్షరటుడే, మెండోరా : Road Accident Awareness | బ్లాక్స్పాట్ల వద్ద అజాగ్రత్తగా వాహనాలు నడుపుతుండడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్మూర్ సీఐ జాన్రెడ్డి (Armoor CI John Reddy) అన్నారు. దూదిగాం కోతిదేవుడు సమీపంలోని బ్లాక్ స్పాట్ ప్రాంతంలో రోడ్డు భద్రతపై శనివారం మెండోరా ఎస్సై సుహాసిని (Mendora SI Suhasini), సర్పంచ్ బాబా, ఉప సర్పంచ్ శ్రీనివాస్తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Road Accident Awareness | హెల్మెట్ ధరించాలి
దూదిగాం బ్లాక్స్పాట్ వద్ద గ్రామ ప్రజలను సమీకరించి రోడ్డు ప్రమాదాల నివారణపై సమగ్రంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యత, అధిక వేగం వల్ల జరిగే ప్రమాదాలు, రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే గతంలో జరిగిన ప్రమాదాల ఉదాహరణలు చూపించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ‘గో స్లో’ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం బ్లాక్ స్పాట్ వద్ద ‘గో స్లో’ (GO SLOW) హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Women Reservation Bill | బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్కు మహిళలే గుణపాఠం చెప్తారు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
