అక్షరటుడే, వెబ్డెస్క్ : Singur dam safety | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Rajanarsimha) సింగూర్ డ్యామ్ (Singur Project) సేఫ్టీ పనులను సోమవారం పరిశీలించారు. వచ్చే 50 ఏళ్లు సింగూరు ప్రాజెక్టు డ్యాం నిలిచేలా (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల మేరకు) నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
సింగూర్ ప్రాజెక్ట్ భద్రతపై గతేడాది ఎన్డీఎస్ఏ (NDSA) ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో గత వానాకాలంలో ప్రాజెక్ట్లో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేయలేదు. ఫలితంగా యాసంగి సీజన్లో సింగూర్, ఘనపురం ఆనకట్ట పరిధిలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందలేదు. ప్రస్తుతం డ్యామ్లో నీటి మట్టం తగ్గడంతో అధికారులు వేగంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పనులను పరిశీలించారు.
Singur dam safety | పర్యాటకంగా అభివృద్ధి
సింగూర్ ప్రాజెక్టులో ఉన్న ఐలాండ్ అభివృద్ధిపై టూరిజం అధికారులతో మంత్రి చర్చించారు. ఐలాండ్ అభివృద్ధి, బోటింగ్, పార్కులు, గార్డెన్ బ్యూటిఫికేషన్, కాటేజిల నిర్మాణం, రెస్టారెంట్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. త్వరలో సింగూర్ డ్యాం సేఫ్టీ పనులతో పాటు టూరిజం అభివృద్ధి పై ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పెద్దారెడ్డి పేట ఎత్తిపోతల పథకం పనులపై సైతం మంత్రి సమీక్షించారు. అనంతరం ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్తో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై చర్చించారు. అందోల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దీనిని కూడా చదవండి : Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి
