Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు..​ కన్నతల్లే యమకింకరిణి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - ​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు..​ కన్నతల్లే యమకింకరిణి!

క్రైంనిజామాబాద్

​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు..​ కన్నతల్లే యమకింకరిణి!

ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో మాట్లాడి కన్నతల్లే హత్య చేయించిందని తేలింది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 10:45 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
​ Kamareddy Police |
​ Kamareddy Police |ఐదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన తల్లి, ప్రియుడి అరెస్ట్

అక్షరటుడే, కామారెడ్డి: ​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన కామారెడ్డిలో(kamareddy) కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లే తన ప్రియుడిని పురమాయించి హత్య చేయించిందని తేలింది.

​ Kamareddy Police | రాజంపేట్​కు చెందిన..

ఈ మేరకు కామారెడ్డి(Kamareddy Police) పట్టణ సీఐ నరహరి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. రాజంపేటకు చెందిన రజిత అలియాస్ లక్ష్మీకి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్​తో 2014లో వివాహం అయింది. వీరికి ఐదేళ్ల కుమారుడు శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు సమీరా ఉన్నారు.

అయితే భర్తతో గొడవల కారణంగా ఆరు నెలల క్రితం రజిత(లక్ష్మీ) తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరాంనగర్ కాలనిలో ఉంటోంది. ఆమె కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్​లో (Kamareddy RTC Bus Stand) స్వీపర్​గా పని చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే లక్ష్మీనర్సింలు అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

కాగా, వివాహేతర సంబంధానికి తన కొడుకు అడ్డుగా ఉన్నాడని లక్ష్మీనర్సింలుతో కలిసి ఆమె పన్నాగం పన్నింది. ఎప్పటిలాగే శుక్రవారం విధులకు లక్ష్మీ వెళ్ళగానే సాయంత్రం సమయంలో శ్రావణ్(5)​ను గొంతు పిసికి, నోరు-ముక్కు మూసి నేలకేసి కొట్టి కంట్లో కారం చల్లి దారుణంగా హత్య చేశాడు.

ఈ విషయమై రాజంపేటకు చెందిన లక్ష్మీ బాబాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ (Kamareddy City) సీఐ నరహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

పోలీసుల విచారణలో వివాహేతర సంబంధమే శ్రావణ్ హత్యకు కారణమని తేలడంతో లక్ష్మీతో పాటు లక్ష్మీనర్సింలును అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ తెలిపారు.

ఇది కూడా చదవండి: Armoor Police | మహిళ హత్య  కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు

Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి
Hyderabad Love Fraud | హైదరాబాద్‌లో అమానుషం.. ప్రేమ పేరుతో మతాంతర వివాహం చేసుకొని మోసం
Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
TAGGED:child murder casefamily crime caseillicit affair crimeKamareddyKamareddy Citykamareddy crimeKamareddy RTC Buspolice investigation indiashocking crime newsTelangana Crime NewsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chaitanya Reddy Transfer Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్​!
Next Article Kisan Nyay Satyagraha | Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?