అక్షరటుడే, వెబ్డెస్క్: Kavitha Comments | అంబేడ్కర్ అంటేనే ధైర్యం అని, ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల క విత (Kalvakuntla Kavita) అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగానైనా ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలన్నారు.
అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) సందర్భంగా కవిత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షే అన్నారు. ఆఇయన సాధారణ వ్యక్తి కాదని, ఒక ఐడియాలజీ అన్నారు. తెలంగాణలో అంబేడ్కర్ గారి కోరిక ప్రకారం స్టేట్ సోషలిజం వర్ధిలాల్సి ఉండాలన్నారు. కానీ 12 ఏళ్లలో దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Kavitha Comments | దళితులపై ఆకృత్యాలు
రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ప్రతి చోట దళితులు, మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులే భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను (Assigned lands) ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..: Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్రెడ్డి
