అక్షరటుడే, కామారెడ్డి: Farmer Suicide | తన సొంత వ్యవసాయ భూమిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Farmer Suicide | దోమకొండ మండలం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ(Domakonda) మండలం చింతమాన్ పల్లి గ్రామానికి చెందిన శివాయిపల్లి లింగవ్వకు కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన లింగవ్వ అదే భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి భర్త గతంలోనే మరణించగా.. అప్పులు ఎక్కువైనట్టు(agriculture crisis) సమాచారం. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు (Domakonda Police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి(Kamareddy GGH) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
