అక్షరటుడే, భీమ్గల్: Farmers MSP Procurement | రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డి సూచించారు. పచ్చలనడ్కుడ (Pachchalanadkuda) సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Farmers MSP Procurement | 50 కేంద్రాల ఏర్పాటు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కంటే భిన్నంగా, రైతుల సౌకర్యార్థం ఈసారి అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘వేల్పూర్ మార్కెట్ కమిటీ (Velpur Market Committee) పరిధిలో మొత్తం 50 కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. సహకార సంఘాలతో పాటు మహిళా సంఘాల ద్వారా కూడా సేకరణ జరుపుతున్నామని పేర్కొన్నారు. రైతులు అడగకముందే మక్కల (మొక్కజొన్న) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన కొనియాడారు.
Farmers MSP Procurement | మద్దతు ధరతోనే మేలు..
వ్యాపారస్థుల చేతుల్లో రైతులు (Farmers) మోసపోకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సారెడ్డి స్పష్టం చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ రమేష్, సెక్రెటరీ మహబూబ్, సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ రఘు, ఏఈవో స్నేహశ్రీ, జీపీవో కిషన్, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, ఓబీసీ సెక్రెటరీ లింగేశ్వర్, మాజీ ఛైర్మన్ లింబారెడ్డి, నాయకులు వినోద్, హలీం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
